Vii Class Telugu All Lessons Kavi Parichayaalu తెలుగు పాఠాలు - కవి పరిచయాలు - వారి రచనలు7 వ తరగతి

తెలుగు పాఠాలు - కవి పరిచయాలు - వారి రచనలు

7 వ తరగతి


1. చదువు


ఈ పాఠం (కథాకావ్యం ప్రక్రియకు చెందినది. కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్ధాశ్వాసంలోనిదీకథ. భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది.

4. అమ్మ జ్ఞాపకాలు


పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ''శబ్నం' కవితా సంపుటిలోనిది.

కవి పరిచయం !

 టి. కృష్ణమూర్తి యాదవ్ తన తొలి కవితా సంపుటి 'తొక్కుడు బండ' తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. 'శబ్నం' వీరి రెండవ కవితాసంపుటి. 

5. పల్లె అందాలు 


ఈ పాఠం కావ్యప్రక్రియకు చెందినది. ఆచ్చి వేంకటాచార్యులు రచించిన మాఊరు' లఘుకావ్యం లోనిది.

కవి పరిచయం

 ఆచ్చి వేంకటాచార్యులు. ఆండాళ్ బుర్రకథ, రాగమాల, మాఊరు (ఏకాశ్వాస ప్రబంధం) ఈయన రచనలు. 

6. ప్రేరణ


రచయిత పరిచయం

 డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలామ్ 'ఒక విజేత ఆత్మ కథ' (ఇగ్నీటెడ్ మైండ్స్ ది వింగ్స్టఫ్ ఫైర్-యాన్ ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశాడు.

7. శిల్పి


ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. గుఱ్ఱం జాషువా రచించిన 'ఖండకావ్యం' మొదటిభాగంలోనిది ఈ పాఠం.

కవి పరిచయం

 గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్మహల్, నేతాజి, బాపూజీ, క్రీస్తుచరిత్ర, నాకథ, స్వప్నకథ, కొత్తలోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. కవికోకిల, కవితావిశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగకవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. 

8. గ్రామాలలోని వేడుకోలు క్రీడా వినోదాలు


ఈ పాఠం 'రేడియో ప్రసంగం' ప్రక్రియకు చెందినది. దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు.

రచయిత పరిచయం

 రచయిత దేవులపల్లి రామానుజరావు. 1946 లో 'శోభ' అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితి, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 'ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు' ఈయన ఆత్మకథ. 

9. ఏ కులము

ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. చేరబండరాజు రచించిన "జన్మహక్కు అనే కవితా సంపుటి లోనిది..

కవి పరిచయం
అసలు పేరు బడ్డం భాస్కరరెడ్డి మేడ్చల్ జిల్లాలోని అంకులాపురం. 'గమ్యం'. "వ" ఇతని కవితా సంకలనాలు, 'కత్తిపాటు' ఇతని పాటల సంకలనం. కడతల సంఘం వ్యవస్థాపకు సభ్యడు. 

10. శ్రీలు పొంగిన జీవగడ్డ


ఈ పాఠం 'గేయ' ప్రక్రియకు చెందినది. రాయప్రోలు సుబ్బారావు రచించాడు.

కవి పరిచయం
 తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. 


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts