పిల్లలందరికీ ( 1 నుండి 5 వ తరగతి వరకు ) మౌలిక భాషా , గణిత సామార్థ్యాల సాధన కోసం ' తొలిమెట్టు ' కార్యక్రమాన్ని 2022-23 విద్యాసంవత్సరం నుండి అమలుపరుస్తున్నారు .
♦ ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరకీ ప్రణాళికాబద్ధంగా బోధనాభ్యసన కార్యక్రమాలను అమలుపరచాల్సి ఉంటుంది . ప్రధానంగా 2020 మార్చి నుండి కరోనా మహమ్మారివల్ల పిల్లలు పూర్తిస్థాయిలో అభ్యసన ఫలితాలను సాధించడంలో వెనుకబడ్డారు . * కాబట్టి 2022-23 విద్యాసంవత్సరంలో జూన్ , జూలై , ఆగష్టు మాసాల్లో మొదట 2 నుండి 5 వ తరగతి విద్యార్థులకు ఆయా తరగతుల్లో కొనసాగుటకు అవసరమైన కనీస సామర్థ్యాల మీద దృష్టిపెట్టి బోధనాభ్యసన ప్రణాళికలను రూపొందించుకొని అమలుపరచాల్సి ఉంటుంది .
♦ ఇదే విషయాన్ని 2021 ఎన్.ఎ.ఎస్ . ఫలితాలు కూడా వెల్లడించాయి . ఇందుకోసం మొదట కనీస సామర్థ్యాల మీద అభ్యాసం కల్పించి తదుపరి తరగతి వారి సామర్థ్యాల మీద దృష్టిపెట్టాలి . * సెప్టెంబరు మాసం నుండి తరగతి వారీగా సామార్థ్యాల వారీగా అభ్యసన ఫలితాల సాధనకోసం కృషిచేయాలి . ఆ ) బోధనాభ్యసన ప్రణాళికలు 2022-23 విద్యాసంవత్సరంలోని మొత్తం పనిదినాలు 220 రోజుల్లో బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం 140 రోజులు అనగా 28 వారాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు .
♦ సాధారణంగా ఒక వారానికి 6 పనిదినాలు ఉంటాయి . వీటిలో 5 రోజులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం , 1 రోజు మూల్యాంకనం , పునరభ్యాసం కోసం యించారు . ఇందుకోసం అర్ధవంతంగా , కృత్యాధార పద్ధతుల్లో , పిల్లలందరూ భాగస్వాములు అయ్యేలా 1 ) వార్షిక , 2 ) పాఠ్య / వారపు , 3 ) రోజు వారీ కాలాంశం లేదా పీరియడ్ ప్రణాళికలను రూపొందించుకోవాలి . వీటిపట్ల అవగాహన పెంపొందించుకొని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి వీటి ప్రణాళిక నమూనాలను రూపొందించారు .
ఈ క్రింద క్లిక్ చేసి మెటీరియల్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Telugu Medium Modules
EVS TM Module
English Medium Modules
Urdu Medium Modules
1 Comments
Thanks for sharing this sir. its very useful for us
ReplyDeletePlease give your comments....!!!