Lr. A2/28/2025: Date 15-05-2025
పత్రిక ప్రకటన
కార్పొరేట్ కాలేజీలలో ప్రవేశములకు ధరఖాస్తుల ఆహ్వానం చివరి తేది 31-05-2025.
2025-26 ప, విద్యా సంవత్సరమునకు గాను అర్హులైన SC/ST/BC/EBC/Disabled/Minority విద్యార్థులచే కార్పొరేట్ కాలేజీలల్లో అడ్మిషన్లకై ఆన్లైస్ లో ధరఖాస్తులు స్వీకరించబడుచున్నవి. మార్చి-2025వ, సం.. లో 10 వ,తరగతి నందు GPA 7.0 / 100 ఆ పైన గ్రేడ్ మార్కులు పొందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహములు. / ఆశ్రమ పాఠశాలలు / కస్తూరిబా పాఠశాలలు మరియు ప్రభుత్వ మున్సిపల్, జిల్లా పరిషత్ మరియు ఏయిడెడ్ పాఠశాలలో చదివిన విద్యార్ధులు ( డే స్కాలర్) మరియు ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్, జవహర్ నవోదయ విద్యాలయముల విద్యార్థులు మరియు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకము క్రింద చదివిన విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవచ్చును.
ధరఖాస్తులు చేసుకొనే విద్యార్థులు తేది: 17-05-2025 నుండి 31-05-2025 వరకు Epass website ద్వారా (http://telanganaepass.cgg.gov.in) నందు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చును. మరియు ధరఖాస్తుతో పాటుగా
ఈ క్రింద తెలిపిన సర్టిఫికెట్లను జతచేయవలెను.
1. 10 వ తరగతి పాస్ మెమో
2. కులం ఆధాయము సర్టిఫికెట్స్ మీ సేవ ద్వారా పొందినది.
3. బ్యాంక్ పాస్ బుక్
4. విద్యార్థి ఆధార్ కార్డు
5. రేషన్ కార్డు సంబర్ వివరములు
6. పాస్ పోర్ట్ సీజ్ ఫోటో
7. విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్స్ (4వ, తరగతి నుండి 10వ, తరగతి వరకు) ఏడు సంవత్సరములవి జతపరచవలెను.
8. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహములలో చదిపనటువంటి విద్యార్థులు సంబందిత వసతి గృహ సంక్షేమ అధికారిచే (03) సం. ల కు సంబందించిన బోనఫైడ్ సర్టిఫికెట్స్ తీసుకొని అట్టి దానిపై సహాయ సంక్షేమ అధికారిచే దృవీకరించి జతపరచవలెను.
ఆన్లైన్ లో ఈ పాస్ వెబ్ సైటు నందు ధరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్యత క్రమములో (03) కళాశాలను ఎంపిక చేసుకోవలెను. ధరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ పాస్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఆటోమేటిక్ గా జరుగును. మరియు కళాశాలలకు కూడా అలాట్ చేయయబడును.
(శ్రీమతి సి హెచ్ . కవిత )
కవిల్
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, కార్యాలయం, ໖໖ ໖໘ 15/05/2005
టు :
జిల్లా పౌర సంబంధాల అధికారి, సిద్దిపేట జిల్లా గారు ఇట్టి ప్రకటనను జిల్లాలోని అన్ని దిన పత్రికలలో ప్రచురణ చేయుట నిమిత్తం పంపనైనది.


Please give your comments....!!!